గురజాడ శత వర్థంతి సభ

నవ్యాంధ్ర నిర్మాణంలో మహాకవి గురజాడ అప్పారావు ముందుచూపుÑ ప్రగతిశీల, ప్రజాస్వామిక భావజాలం  ప్రతిబింబించాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి అన్నారు. విశాఖపట్నం పౌరగ్రంథాలయంలో నవంబర్‌ 30న మొజాయిక్‌ సాహిత్య సంస్థ ఆధ్వర్యాన మహాకవి గురజాడ అప్పారావు శత వర్ధంతి వత్సర ప్రారంభ సభ జరిగింది. ఎల్‌ ఆర్‌ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో తెలకపల్లి రవి ప్రారంభోపన్యాసం చేశారు. గురజాడ సాహిత్యాన్ని గుర్తుచేసుకోకుండా నవ్యాంధ్రలో కదలిక, చైతన్యం తేవడం సాధ్యం కాదన్నారు.  రాచరిక వ్యవస్థలో ఉండి కూడా దేశభక్తి గురించి ఎలుగెత్తి చాటారనిÑ స్త్రీలను శక్తివంతులుగా, చైతన్యవంతులుగా తీర్చిదిద్దారని అన్నారు. దురదృష్టం కొద్దీ నేడు దేశాన్ని ఏలుతున్న వారికి దేశభక్తి లేకుండా పోయిందన్నారు. ‘దేశం అంటే మనుషులు కాదు. పెట్టుబడులు, ప్రచారార్భాటం’ అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. దేశమంటే మనుషులోయ్‌ అని గురజాడ చెబితే` ప్రస్తుత పాలకులు మనుషులను గుర్తించకుండా భూముల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. రాష్ట్రాలుగా విడిపోయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలిపేది తెలుగు భాష ఒక్కటేనని అన్నారు. సాహిత్యం సామాన్యులకు చేరాలనే ఉద్దేశంతో గురజాడ ఆనాడు వాడుకభాషలో రచనలు చేశారన్నారు. ప్రపంచీకరణ జాడ్యంతో తెలుగుకు ముప్పు ఏర్పడిరదని ఆందోళన వ్యక్తంచేశారు. గురజాడ 150వ జయంతిని మరచిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చివర్లో హడావిడి చేసిందని, ఈ ప్రభుత్వం  ఇప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. ఆయన సాహిత్యానికి ప్రాచుర్యం లభిస్తే ప్రజలకు ప్రశ్నించే చైతన్యం వస్తుందని పాలకులకు భయమని విమర్శించారు. కమ్యూనిస్టులు వెలికితీశాకే గురజాడ రచనలకు ఈ మాత్రమైనా ప్రచారం కల్పించారని గుర్తుచేశారు.సాహితీవేత్త రామతీర్థ మాట్లాడుతూ గురజాడ జయంతికి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కేటాయించిన రూ.5 కోట్ల నిధులు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. తెలుగు వైతాళికుల ప్రాచుర్యానికి, సాహిత్య ప్రచారానికి నిధులు కేటాయించాలని, దీనిపై సాహిత్యవేత్తలు గొంతెత్తాలని పిలుపిచ్చారు.గురజాడ సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. శత వర్ధంతి వత్సర సందర్భంగా గురజాడ రచనలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాల్సింది ఉందని అన్నారు.ప్రజల్లోకి గురజాడ ప్రగతిశీల వారసత్వంగురజాడ అప్పారావు అందించిన ప్రగతిశీల వారసత్వాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సాహితీ విమర్శకులు తెలకపల్లి రవి అన్నారు. మహాకవి గురజాడ శత వర్థంతి సంవత్సరం ప్రారంభం సందర్భంగా విశాఖ విచ్చేసిన ఆయన విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలోని గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నవ్యాంధ్ర నిర్మాణంలో గురజాడ తాత్విక దృష్టిని, ముందు చూపును ప్రతిబించించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కవులు, రచయితలతో సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి నూనెల శ్రీనివాసరావు అధ్యక్షతన చర్చాగోష్టి జరిపారు. తెలకపల్లి పల్లి రవి సాహిత్యకారుల కర్తవ్యాలపై మాట్లాడారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యాజీ, జిల్లా అధ్యక్షులు రమణాచలం, రమణారావు, రచయితలు అనంతరావు, ఎవిఆర్‌ మూర్తి, అడపా రామకృష్ణ, ఎయు రిటైర్డు అసిస్టెంటు రిజిస్ట్రార్‌ నాగేశ్వరరావు తదితరులు మాట్లాడారు. జివిఎన్‌ చలపతి, స్వతంత్రకుమార్‌, ప్రజాశక్తి విశాఖ ఎడిషన్‌ మేనేజర్‌ ఎస్‌.సుధాకర్‌ పాల్గొన్నారు.