కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి
అడిగోపుల వెంకటరత్నం అనుక్షణం, అలుపెరగని జలపాతంలా, అభ్యుదయ భావాలతో, చైతన్య దీప్తితో శాస్త్రీయ దృక్పథంతో రాస్తున్న కవి. అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా, శ్రామికవర్గ చైతన్యాన్ని రేకెత్తించే విధంగా, వీరి కవిత్వం ఉంటుంది. పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా, సామాజిక, రాజకీయ, ఆర్థిక, కాలుష్యం మీద కన్నెర్రజేస్తూ, మహిళాభ్యున్నతిని కాంక్షిస్తూ వీరి కవిత్వం సాగిపోతుంటూంది. పల్లెతల్లి ఉల్లాన్ని కుళ్లబొడుస్తూ, పట్టణాల్లో వెట్టిచాకిరీ చేసుకోమని ప్రోత్సహిస్తున్న, పాలకుల పాపిష్టి స్వార్థాన్ని తూర్పారబట్టే, సాహసోపేతమైన సాహిత్యాన్ని వీరు రాస్తుంటారు.