ప్రముఖ రచయిత, విశాలాంధ్ర సంపాదకుడు ముత్యా ప్రసాద్ నవంబర్ 24న కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు తాూకా అగిరిపల్లి వీరి స్వగ్రామం. ముత్యా రాధాకృష్ణమూర్తి, అన్నపూర్ణమ్మ దంపతుకు 1966లో ముత్యా ప్రసాద్ జన్మించారు. గన్నవరం కళాశాలో డిగ్రీ చదివారు. 1990లో విశాలాంధ్ర దినపత్రికలో సబ్ ఎడిటర్గా చేరారు. చీఫ్ సబ్ ఎడిటర్గా, సండే ఇన్చార్జిగా 2006 వరకు పనిచేశారు. సండే మేగజైన్ను తీర్చిదిద్దడంలో ఆయన ఎంతో కృషిచేశారు. కొద్దికాం సాక్షి దినపత్రికలో సీనియర్ సబ్ఎడిటర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2014 లో తిరిగి విశాలాంధ్రలో చేరి సంపాదక బాధ్యతు చేపట్టారు. ముత్యా ప్రసాద్ అభ్యుదయ రచయిత సంఘం కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు. కృష్ణాజిల్లా అరసం కార్యదర్శిగా ఉన్న కాంలో ‘అభ్యుదయ’ పేరుతో మివైన కవితతో కవితా సంకనం మెవరించారు. విశాలాంధ్ర పత్రికలో ఎంతో మంది యువరచయితను, ఔత్సాహికును ప్రోత్సహించారు. ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకు దాసరి నాగభూషణరావు ప్రోత్సాహంతో ప్రగతిశీ దృష్టిని అవర్చుకొన్నారు. విశాలాంధ్రలో ప్రసిద్ధ సాహిత్యవేత్త గురించి మివైన వ్యాసాు రాసారు. ముత్యా ప్రసాద్ సంపాదకీయాు ఎంతో అధ్యయనం చేసి రాస్తారని పేరు పొందారు. ముత్యా ప్రసాద్ సంపాదకీయాు ‘ముత్యా మా’ పేరుతో పుస్తకంగా మెవరించడానికి సిద్ధం చేసారు. చిన్నవయసులో ముత్యా ప్రసాద్ కన్నుమూయడం తొగు పాత్రికేయ రంగానికి, సాహిత్య రంగానికి తీరని లోటు. సాహిత్య ప్రస్థానం, సాహితీస్రవంతి తరపున ముత్యా ప్రసాద్కు నివాళి అర్పిస్తున్నాం. వారి కుటుంబ సభ్యుకు మా ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నాం.