- దేవిప్రియ
జర్నలిజం, సినిమా, అడ్వర్టయిజ్మెంట్ ఇలా వివిధ వ్యాపకా మధ్య కవితా రచన కొనసాగించడంలో సమస్యు సదుపాయాు ఎలా వున్నాయి?
నాకు సాహిత్యమంటే ఏమిటో చూచాయగా తెలిసింది 1966-67 ప్రాంతాల్లోనే. తెనాలి విఎస్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడు మా కాలేజీ మ్యాగజైన్లో కొన్ని రచను చేశాను. గుంటూరు ఎసి కాలేజీలో బిఎలో చేరిన తర్వాత కరుణశ్రీ జంధ్యా పాపయ్యశాస్త్రి, స్పూర్తిశ్రీ వంటి అధ్యాపకు ప్రభావం వ్ల ప్రాచీనకవిత్వం గురించి అంకారా గురించి కొంత వరకు తొసుకోగలిగాను. అలా కవిత్వం మీద ఆసక్తి అభిమానం పెరుగుతూ వచ్చాయి. అయితే జీవితం ఒక్కొక్క దశలో ఒకో పని చేస్తూ వచ్చాను. అలా వెళ్లవసిన అవసరం నాకు ఏర్పడిరది. నా లోప కవితా దాహం మాత్రం అలాగే వుండిపోయింది. నాకు కిటికీు ఎక్కువ. అన్నిట్లోంచి చూడటం నా నైజం. సినిమాలు, రంగస్థం చదువుకునే రోజుల్లోనే చాలా సమయం తినేసేవి. అయితే మార్కు కూడా బాగానే వచ్చేవి కనక టీచర్లు ఏమనేవారు కాదు. సినిమాు చాలా ఎక్కువగా చూసేవాణ్ని. 15, 20 సార్లు చూసినవి కూడా వున్నాయి. మెట్రికులేషన్ నాటికే ఈ సినిమా నాపై ఒక మ్యాజికల్ ఎఫెక్టు వేసింది. అప్పుడే నాకు సినిమా గురించి కొన్ని ఒరిజినల్ ఐడియాు వచ్చేవి. ఉదాహరణకు పాటు వినేప్పుడు సంగీతపరికరాు లేకుండా అవన్ని వినిపించడం అసహజమనిపించేది. సినిమా అంటే ఒక టెక్నికల్ప్రాసెస్ అని తొసుకున్నాను. అడ్వర్టయిజింగ్ క్షణాు కూడా స్కూు రోజుల్లోనే వుండేవి. సినిమా శతదినోత్సవాకు సొంత ఖర్చుతో గోడపై రాసేవాణ్ని. పాటు రాసేవాణ్ని. గుంటూరులో మెహర్బాబా గుడి వుండేది. అక్కడ విన్న పాటకు అనుకరణు తయారు చేసేవాణ్ని. ఏమైనా కవిత్వం నా మొదటి ప్రేమగా వుండేది. కవిత్వం నాదారి అని నిర్ణయించుకున్నాను. ఏ విషయమూ దాన్ని డామినేట్ చేయడానికి అనుమతించలేదు. అందుకోసం ఉద్యోగానికి కవిత్వానికి సంఘర్షణ వస్తే రెండో దానికే ప్రాధాన్యత నిచ్చాను. ఆంధ్రజ్యోతిలో జీవకవిత్వం జిందాబాద్ స్పెషల్ వేసినప్పుడు ఎండి జగదీష్ ప్రసాద్ గారు సందేహం వెలిబుచ్చినా వినకుండా వేయించాను. తర్వాత ఆయనే మెచ్చుకున్నారనుకోండి. ఉదయంలో కూడా నారాయణరెడ్డిగారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చినపుడు కవర్ స్టోరీ రాస్తే గజ్జె మల్లారెడ్డిగారు అభ్యంతరపెట్టాని చూశారు. నేను నా నిర్ణయానికే కట్టుబడ్డాను. ఇలా కవిత్వం జీవితం మధ్య ఎంపిక వచ్చినపుడు నేను ఖచ్చితంగా వ్యవహరించాను. అయితే ఏ దేశంలో నైనా మన దేశంలో మరీ కవిత్వాన్ని నమ్మి జీవితం గడపగమని అనుకోను. జీవిక కోసం ఏదో ఒకటి చేయాలి. అవి చేస్తూనే కళాభిరుచిని తృప్తి పరుచుకోడానికి చేయాల్సింది చేశాను. డబ్బు ప్రధాన కన్సిడరేషన్ అనుకోలేదు. గద్దర్ మీద డాక్యుమెంటరీ తీయడానికి చాలా ఖర్చయింది. అది నా అభిరుచికి కన్విక్షన్కు సంబంధించిన విషయం కనకే వెనుకాడలేదు. ఇప్పటికీి దాన్ని ప్రమోట్ చేయలేకపోతున్నాను. అయితే ఇన్ని జీవన మార్గాు నా అనుభవం సృజన ఎన్రిచ్ కావడానికి దోహద పడ్డాయనడంలో సందేహంలేదు.
ఇక్కడే ఒక చిన్న ప్రశ్న. చాలా మంది మీ మిత్రు రాసిన వ్యాసాలో నెత్తిమీద దారిద్య్రముంది అనే మీ కవితను ప్రస్తావించారు. కాని మీరు చాలా ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ పదవు నిర్వహించారు కదా..
నిజమే. నా జీవన శైలి వ్లనే నాకు డబ్బు సమస్య వచ్చింది. ఈ శైలిని నేను కోరుకోలేదు. కాని వచ్చింది. నా యువకదశలో అశాంతిని గుర్తుచేసుకుంటే ఈ మాత్రం సెట్టిల్డ్ లైఫ్ గడుపుతానని ఏనాడూ అనుకోలేదు. ఇంటి బాధ్యతు అనారోగ్యం వగైరా వ్ల కలిగిన సమస్యు. నిజానికి నేను చాలా పేదరికం నుంచి వచ్చాను. కోరుకోకపోయినా పై తరగతి జీవితానికి అవాటు పడ్డాను. మధ్య తరగతి కాంక్షను అందుకోడానికి జరిగే పోరాటంలో ఆర్థిక సమస్యు... దానికి తోడు అనారోగ్యం. ఈ సంగతున్ని సన్నిహిత మిత్రుకు బాగా తొసు గనక వారు ఆ చరణాను ఉటంకిస్తూ
ఉంటారు.
జర్నలిజంలో, అడ్వర్టయిజింగ్లో చాలా ప్రయోగాు చేశారు కాని కవిత్వంలో మాత్రం మీరు సరళత్వాన్నే ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. కారణమేమైనా వుందా?
ఉంది. నా ఉద్దేశంలో కవిత్వం ఒక కమ్యూనికేషన్. అది చేరవసిన వారికి చేరకపోతే రాయడమెందుకు? అర్థం కాని కవిత్వానికి అర్థమే లేదు. అన్ని సృజనాత్మక ప్రక్రియు కూడా ముందుగా జనానికి అర్థం కావాని నేను కోరుకుంటాను. అందుకే నైరూప్య చిత్రాు కూడా నాకంతగా నచ్చవు.
మరి మీరు చేసే సినిమాలో, నర్సింగరావు గారు కొంత ఆ శైలిని అనుసరిస్తారు కదా?
నిజమే. అది కూడా నేను పూర్తిగా ఏకీభవించేది కాదు. దాసి సినిమా వుందనుకోండి. అక్కడ నుంచి ఇక్కడకు రావడాన్ని అంతసేపు చూపించాలా అని నేను చాలాసార్లు అనేవాణ్ని. అయినా ఆ సినిమా స్క్రిప్టు నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నాకు సంబంధించినంతవరకు కమ్యూనికేషన్ కీకం. మిగిలినవన్నీ తర్వాతే. నీ వెంత గొప్పవాడవైతే అంత తేలిగ్గా చెప్పగగాలి. ప్రతిభ కమ్యూనికేషన్కు అవరోధం కాకూడదు. నేను కవిత్వం మెరుగుపరుచుకోవడానికి చాలా చదువుతాను. ఆలోచిస్తాను. అంకారాు ఉపమానాు వగైరాను పట్టించుకుంటాను. కాని అవన్ని మరింత తేలిగ్గా అర్థంకావడానికే. కమ్యూనికేషన్ కోసం కళనైనా సాక్రిఫైజ్ చేస్తానేమో గాని దీనికోసం దాన్ని బలిపెట్టను.
కవి వ్యక్తిగత అంశాు అదేపనిగా రాయడంపై మీ అభిప్రాయం?
ప్రతికవికీ వ్యక్తిగా ఒక అస్తిత్వం వుంటుంది. అనుభవాు సంఘర్షణ జీవితం వుంటుంది. సాంఘిక చైతన్యం, నిబద్ధత వున్న కవి వాటిని సమాజానికి అన్వయిస్తాడు. ఆ పనిలో ఎంత క్లారిటీ వుంటే అంతగా జయప్రదమవుతాడు. వ్యక్తిగత అంశాు సోషల్ రివెన్న్ వున్నంత వరకు రాయవచ్చు. లేకపోతే నిరర్థకం. నేను వ్యక్తిగత అనుభవాు అనుభూతు రాయడానికి వ్యతిరేకం కాదు. కాని అవి అందరి సమస్యుగా కనిపించాలి. చదివిన వాన్ని కదిలించాలి. నాకు సంక్లిష్ట కవిత్వం పట్ల నమ్మకం లేదు. వ్యక్తివాదం చేసేవారిలోనూ గొప్పకవున్నారు. స్మైల్ గొప్ప కవి. వేగుంట మోహన ప్రసాద్ మేము విద్యార్థుగా వున్నప్పుడు ఆయన వస్తే అంత దూరం నుంచి చూసి ఆశ్చర్యపోతుండేవాళ్లం. గుంటూరులో నేను చదువుతున్నప్పుడే భారతిలో ఆయన కవిత్వం వచ్చేది. తొగే కాని ఆ కవిత్వం నాకేం బోధపడేది కాదు. అప్పుడే నేను ఇలా రాయకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఇవాళ ఎంతో కొంతైనా జయప్రదం కాగలిగానంటే అలా అనుకోవడమే కారణం.
ఈ తేలికైన కవిత్వం వ్ల మిమ్మ్ను ఇతయి ఎవరైనా తేలిగ్గా చూసేవారా?
తేలిగ్గా చూడ్డం కాదు కాని ఒక విధమైన హోస్టిలిటీ వుండేది. అది నా కవిత్వం వ్ల కాదు, నా సామాజిక నేపథ్యం వ్ల అనుకునేవాణ్ని. అది సంకుచిత మనస్తత్వం ఫలితం. మన సమాజంలో అనేక దురభిప్రాయాున్నాయి. విద్యార్థి దశలోనే కాదు. తర్వాత కూడా అలాంటి ప్రతికూతను ఎదుర్కొన్నాను. కేవం నా ప్రతిభ వ్లనే పైకి రాగలిగానని చెప్పగను. బ్రాహ్ము తప్ప అప్పట్లో పత్రికా రంగంలో పై స్థానాలో ఎవరూ వుండేవారు కాదు. ఉదయం అడ్వయిజరీ ఎడిటర్గా నేను అపాయింట్ కావడం పెద్ద సంచనం. అందుకు నేను చాలా గర్వపడుతుంటాను.
మీరు మద్రాసులో చాలా కాం సినిమా పరిశ్రమలో పనిచేశారు. తిరిగి నర్సింగరావు ప్రభృతుతో కలిసి 80లో జరిగిన ప్రయత్నాలోనూ భాగస్వామిగా వున్నారు. మరి 50లో అభ్యుదయ రచయితు సినిమా రంగంలో సాధించిన పట్టును విజయాను తర్వాత సాధించలేకపోవడానికి కారణాలేమిటంటారు?
1972 తర్వాత పదేళ్లు నేను అనిసెట్టి గారితో పాటు మద్రాసులో వుండి సినిమా రంగంలో పనిచేశాను. అప్పట్లో ఆయన డబ్బింగ్ కింగ్. సాహిత్యానికి సంబంధించిన విషయాు అనేకం తెలియడానికి ముఖ్యంగా ఆంగ్ల సాహిత్య పరిచయం పెరగడానికి ఆయన చాలా దోహదం చేశారు. కొన్ని సినిమాటైటిల్స్లో ఆయనపేరుతో పాటు నా పేరు కూడా వుంటుంది. అయితే నేను సినిమా రంగం నుంచి వచ్చేశాను. తిరిగి 1980లో మరో విధంగా సినిమా రంగంలో పనిచేశాను. మీరడిగిన ప్రశ్నకు వస్తే 1950లో తెంగాణా పోరాటం అనంతర నిర్బంధ పరిస్థితులో నాటి అభ్యుదయ రచయితు పెద్ద ఎత్తున వస పోయారు. మైగ్రేటెడ్ ఎన్మాస్ అన్నమాట. అప్పుడు తొగు సినిమా పరిశ్రమ బాగా అభివృద్ధిచెందే దశలో వుంది. న్యూటాలెంట్ కోసం చూస్తూ వుంది. ఈ వెళ్లిన వారు కేవం బ్రతుకు తెరువు కోసం, రక్షణ కోసం వెళ్లారు. అలాంటి తరుణంలో వారిని పరిశ్రమ వుపయోగించుకుంది. ఒక రకంగా వారి ప్రతిభను క్లొగొట్టింది. వారంతా ప్రజపక్షాన నివవసిన రచయితు. కాని సినిమా రచయితుగా మారిపోయారు. కాని 80లో మేము వెళ్లినప్పటి పరిస్థితి వేరు. సన్నివేశం పూర్తిగా మారిపోయింది. వ్యాపారసినిమా బాగా వేళ్లూనుకుంది. సినిమా రచయితను కావాని నేను సీరియస్గా ప్రయత్నించలేదు. కమర్షియల్ సినిమాకు ప్రత్యామ్నాయంగా ఆర్ట్ సినిమా వుందని చెప్పడం, దాని
ఉనికిని చూపడం నా ఉద్దేశం అంతే. నేను ప్రత్యామ్నాయ భావాతో సినిమా పరిశ్రమకు వెళ్లాను. ముందే చెప్పాను కదా, చిన్నప్పటి నుంచే నాకు సినిమా అంటే చాలా ఆసక్తి అని. నేను ప్రజాతంత్ర ఎడిటర్గా వున్నప్పుడే ఆర్ట్ సినిమా గురించి రాసేవాణ్ని. నిస్సంకోచంగా విమర్శు చేసేవాణ్ని.
దిగంబర కవిత్వానికి వ్యతిరేకంగా పైగంబర కవిత్వం రాశారు కదా, మరి అలాంటి విమర్శలే చేస్తున్నవారితో మీ సంబంధాలెలా వుండేవి?
సి.పి.ఐ, సి.పి.ఎమ్ రెండూ దిగంబర కవిత్వాన్ని గట్టిగా వ్యతిరేకించాయి. పైగంబర కవుగా మేము రావడం వెనక సిపిఐ హస్తం లేదా ఆ పార్టీకి సంబంధించిన మేధావు ప్రోద్బం వున్నాయని చాలామంది అనుకున్నారు. మేము గుంటూరులో పరుచూరి రాజారాంగారి సహాు తీసుకోవడం, పైగంబర కవు తొలిసంపుటి విశాలాంధ్ర బుక్హౌస్ మేడపైన ఆవిష్కరించడం ఇందుకు కారణమైవుండొచ్చు. కాని మాకు అలాంటి అభిప్రాయాు లేవు. నిజానికి నాకు దిగంబర కవు విషయంతో పెద్ద విభేదం వుండేది కాదు. కాని చెప్పే తీరుపైనే అభ్యంతరముండేది. అంతే శక్తివంతంగా రాసి దాన్ని ఎదుర్కొవానుకునేవాళ్ళం. మమ్మ్ను పురి కొల్పినవాడు సుగమ్బాబు.
నాకు రాజకీయంగా అంత స్పష్టత వుండేది కాదు. విశాఖలో శ్రీశ్రీ షష్టిపూర్తి, విశాఖ విద్యార్థు కరపత్రం వగైరా తర్వాత విరసం ఆకర్షించింది. ఖమ్మంలో దాని మహాసభకు వెళ్లాను. ప్రదర్శనలో ముందుభాగాన పాల్గొన్నాను. కాని అప్పటి నుంచే నాలో సందేహాుండేవి. ఏం జరుగుతుందో తెలియకుండా ఎలా చేరడం అనిపించింది. రాజకీయాలే ప్రధానంగా అనిపించాయి. తెలియకుండానే ఆగిపోయాను. మేము ముగ్గురం ఖమ్మం వెళ్లాము. ఓల్గా, సుగమ్ బాబు విరసంలో చేరిపోయారు. నేను చేరకుండానే తిరిగొచ్చాను. వాస్తవానికి నేనెప్పుడూ ఓకల్కాదు. రిస్ట్రయిన్డ్గానే వున్నా.
అంటే బ్రాడ్ లెఫ్ట్ ఐడియాజీని మీరు బపరుస్తారు కదా?
ఔను. లెఫ్ట్ లీనింగ్స్ ఎప్పుడూ వున్నాయి. ఇంకా ఇంకా పెరుగుతున్నాయి కూడా. విరసంతో సహా అన్ని ఇంకా రివెన్స్ కలిగివున్నాయనే నా భావం. అయితే ఈనాటి పరిస్థితులో విరసం, అరసం అంటూ గీతు గీచుకోవడం ఇర్రివెంట్ అని, ప్రజాతంత్ర భావాు కవారందరిని కుపుకొని పోవాని`నేననుకుంటున్నాను.
మీరు చాలా సార్లు చెప్పినట్టు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ద్వారా చేరాతు, ప్రారంభం కావడానికి దళిత స్త్రీ, మైనార్టీవాదాపై చర్చు తీవ్రం కావడానికి కారకుయ్యారు కదా. ఆయన రాతపై అనేక అభిప్రాయాున్నాయి. వాటిని ఆయనకే వదిలేసినా ఈ వాదాపై మీ అభిప్రాయాలేమిటి?
స్త్రీ వాదం నిజానికి ఎప్పటినుంచో వున్నదే. రెండు వాదాలో సామాజిక పరిస్థితు నుంచి ఉత్పన్నం అయ్యాయి. ఆయా తరగతు వారు అభివృద్ధి కావడం వ్ల చైతన్యం పెరగడం వ్ల వారిపై ఇతర వర్గా ఒత్తిడిపీడన పెరగడం వ్ల వచ్చిన వాదాని నేననుకుంటాను. ఆ రియాక్సన్కు సాహిత్య ప్రతిస్పందనగా వచ్చాయి. ఇదివరకటి ఐడెంటిటీస్ను ప్రశ్నించడం జరిగింది. కొత్త ప్లాట్ఫాం కోసం అర్జ్ పెరిగింది. దాన్ని వామపక్షాు తీసుకుంటాయని నేను ఆ రోజులో ఆశించాను. అలా జరగనందుకు నిరుత్సాహపడ్డాను. ఏ భావమైనా మార్గదర్శకత్వం వహించే రాజకీయ సంధానకర్త లేకుండా జరుగదు. నాయకత్వం కావాలి. దేశ రాజకీయాకు అతీతంగా వీరు మాత్రమే సాధించగలిగింది వుండదు. అందుకే అవి టేకాఫ్కాలేదు. మైనార్టీలో ఈ రోజున కనపడే కొన్ని ధోరణుకు మతదృష్టి కారణమని నేననుకోను. రాజకీయ వ్యవస్థ ప్రపంచ పరిణామా వ్ల పెరిగే నిరసన ఆ రూపంలో వ్యక్తమవుతోంది. వారు లెఫ్ట్ పార్టీతో ఇంకా ఐడెంటిఫై కాలేకపోతున్నారు. అందుకే వారిని ఎడ్యుకేట్ చేయాలి. అది నా ఉద్దేశం.
అసు అంతర్జాతీయంగా అనేక తీవ్ర పరిణామాు కలిగాయి. సోవియట్ విచ్చిన్నం అప్పుడు నేను హిట్లర్ నవ్వు రాశాను. కాని అక్కడ జరిగిందేమిటి, ఎందుకు జరిగింది ఇలాంటి విషయాపై ఇప్పటికి రచయితుగా మాకు పూర్తిగా స్పష్టతలేదు. వామపక్షాు ఆ పని చేయాలి. అవగాహన పెంచి ఆచరణలో ఐక్యంగా ముందుకు తీసుకుపోవాలి.
ఇంటర్వ్యూ : తెకపల్లి రవి
(ప్రస్థానం 2002 సాహిత్య ప్రత్యేక సంచిక నుండి)