ప్రముఖ అనువాదకురాలు, రచయిత్రి శాంతసుందరి (08.04.1947 11.11.2020) నవంబర్ 11న కన్నుమూశారు. సుమారు 75 పుస్తకాను అనువాదం చేసిన శాంతసుందరి ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమార్తె. ‘ప్రేమ్ చంద్ ఘర్ మే’ అనే పేరుతో ప్రేమ్చంద్ సతీమణి శ్రీమతి శివరాణీ దేవి ప్రేమ్ చంద్ రాసిన హిందీ గ్రంథాన్ని తొగులో ‘ఇంట్లో ప్రేమ్ చంద్’గా అనువదించి 2014 సంవత్సరపు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఆమె అందుకున్నారు. మద్రాసులోని అడయార్ థియొసా ఫికల్ సొసైటీ వారి బాల భారతి అనే పాఠశాలో శాంత సుందరి చదువు మొదయింది. హిందీ పరీక్షు రాసి చదువు అందులోనే కొనసాగించి, హిందీ ఎమ్మేచేసి, బీఎడ్ పూర్తి చేశారు. లిబియాలో అనేక సంవత్సరాు హైస్కూల్ టీచర్గా పనిచేసారు. తొగు నించి హిందీకి, హిందీ నించి తొగుకీ, ఇంగ్లీష్ నించి తొగుకీ ఆమె చేసిన అనువాదాలో వరవరరావు, కె.శివారెడ్డి గార్ల కవిత్వానికీ, డాక్టర్ ఎన్ గోపీ గారి కవితా సంపుటి ‘కాలాన్ని నిద్రపోనివ్వను’, సలీం గారి నవ ‘కాుతున్న పూ తోట’కీ, డేల్ కార్నెగీ వ్యక్తిత్వ వికాస గ్రంథాకీ మంచి స్పందన భించింది. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ ఇంగ్లీషు నవన్నింటినీ తొగు చేశారు. కొడవటిగంటి కుటుంబరావు ప్రసిద్ధ రచన ‘చదువు నవను హిందీలోకీ, ‘కథాభారతి’, ‘కథ కాని కథ’, ఆనంద్ నీకంఠన్ ‘అసురుడు’, ‘అజేయుడు’, ‘రెక్క ఏనుగు’ బాల కథను తొగులోకీ ఆమె అనువదించారు. ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురణ, అభయ్ మౌర్య నవను ‘విముక్తి’ పేరుతో తొగు చేశారు. మంచి అనువాదకురాుగా పేరుతెచ్చుకున్న శాంతసుందరి మృతి తొగు సాహిత్యానికి తీరని లోటు సాహిత్య ప్రస్థానంలో శాంతాసుందరి చేసిన పు అనువాద కథు ప్రచురించాం. శాంతాసుందరికి సాహితీస్రవంతి, సాహిత్య ప్రస్థానం తరపున జోహార్లర్పిస్తున్నాం. వారి కుటుంబ సభ్యుకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.