ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు

ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు 30 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జూలై 15న అనంతపురంలో రాధాస్కూల్‌ ఆఫ్‌ లర్నింగ్‌ క్యాంపస్‌లో 'త్రిదశాబ్ది కవితోత్సవం' నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు డా|| రాధేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కవితోత్సవంలో గతంలో అవార్డు పొందిన 30 మంది కవులతో పాటు 10 మంది సీనియర్‌ కవులకు ప్రతిభా పురస్కారాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అవార్డులు పొందిన కావ్యాలపై రాధేయ రచించిన 'మూడు పదులు - ముప్పై కావ్యాలు' పుస్తక ఆవిష్కరణ, త్రిదశాబ్ది పురస్కార విజేత శ్రీసుధ మోదుగు కు అవార్డు ప్రధానం ఉంటాయని తెలిపారు.