విల్సన్‌రావు కొమ్మవరపు కు పురస్కారాలు

క్యాతం క ష్ణా రెడ్డి  స్మారక సాహితీ పురస్కారం 2018 పేరిట వచన కవితా సంపుటి పోటీలకు జాతీయ స్థాయిలో తెలుగు వుల నుండి వచన కవితా సంపుటులను ఆహ్వానించగా 42 కవితా సంపుటులు వచ్చాయని పొద్దుటూరి మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. విల్సన్‌ రావు కొమ్మవరపు కవితా సంపుటి 'దేవుడు తప్పిపోయాడు' ను న్యాయ నిర్ణేతలు 2018 పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు  తెలిపారు. .హైదరాబాదులో జరిగే సాహితీ పురస్కార సభలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ''శ్రీ కొత్తపల్లి నరేంద్ర బాబు'' జ్ఞాపకార్ధంగా 2016-2017 సంవత్సరాలలో వచ్చిన కవిత్వ సంపుటాలను పురస్కారానికి ఆహ్వానించినట్లు కవిసమ్మేళనం సాహిత్యవేదిక ఒక ప్రకటనలో తెలిపింది. యాబైకి పైగా కవితా సంపుటాలు  పురస్కారం కోసం వచ్చాయని, కొమ్మవరపు విల్సన్‌ రావు  ''దేవుడు తప్పిపోయాడు'' కవితా సంపుటికి   పురస్కారం లభించిందని తెలిపారు. వారికి జూలై 8 అనంతపురంలో జరిగే సభలో పురస్కారం అందివ్వనున్నట్లు తెలిపారు.