చిద్రమవుతున్న మానవ సంబంధాలు, సంఘర్షణకు లోనవుతున్న ఆధునిక జీవితం, ఏకాకిగా మారుతున్న మనిషి వంటి సంఘటనలకు అక్షర రూపమే 'కోయిలచెట్టు' కథాసంపుటి లోని కథలు అని ప్రముఖ రచయిత్రి నిర్మలారాణి వ్యాఖ్యానించారు. డా.యం.ప్రగతి రచించిన 'కోయిలచెట్టు' కథాసంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని సాహితీస్రవంతి అనంతపురం జిల్లా కమిటీ జూన్ 2 న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించింది. కేంద్ర సాహిత్య అకాడమి కౌన్సిల్ సభ్యులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి నిర్మల ముఖ్య అతిథిగా విచ్చేసి, పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయనశాస్త్ర అధ్యాపకురాలై ఉండి సాహిత్య స జన చేయడం ముదావహం అని ప్రశంసించారు. సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలకు అందమైన అల్లికల పొదరిల్లు ''కోయిలచెట్టు'' గా సమీక్ష చేశారు ప్రముఖ రచయిత్రి నిర్మలా రాణి. కథ, కథనం రెండూ చాలా విభిన్నంగా ఉండి, స్త్రీ దష్టికోణం నుండి వ్యాఖ్యానించడమే 'కోయిలచెట్టు' కథలకున్న ప్రధాన లక్షణమని సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యుడు పిళ్ళా కుమారస్వామి పేర్కొన్నారు. ఆధునిక ద క్పథం, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతిని గమనించి, సామాజిక పరిణామాలకు అనుగుణంగా తగిన కథావస్తువులు ఈ కథల్లో తీసుకోబడ్డాయని ప్రసిద్ధ కథా రచయిత సింగమనేని నారాయణ వ్యాఖ్యానించారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి తీవ్రమైన పని ఒత్తిడిలో ఉండి కూడా మన ఎదురుగా జరుగుతున్న సంఘటనల వెనుకనున్న సంఘర్షణను గమనించడం, దానిని సాహిత్య సజనగా ఆవిష్కరించడం చాలా గొప్ప విషయమని రచయిత్రిని అభినందించారు. పుస్తక రచయిత డా. ప్రగతి తన స్పందన తెలియజేస్తూ, వత్తి రీత్యా రసాయన శాస్త్ర అధ్యాపకురాలిని అయినప్పటికీ చిన్ననాటి నుంచీ సాహిత్యంతో ఉన్న పరిచయం, చుట్టూ జరిగే సంఘటనలకు స్పందించే గుణం కారణంగా కథలు రాయగలిగానని తెలిపారు. ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి అనంతపురం నగర అధ్యక్షురాలు సునీత ఆహ్వానం పలకగా, జిల్లా కార్యదర్శి హిదయతుల్లా వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు క ష్ణవేణి, కిషోర్, ప్రముఖ సాహితీ వేత్తలు ఏలూరి ఎంగన్న, ఆచార్య దేవకి, ఆచార్య శ్రీనివాసరెడ్డి, సడ్లపల్లి చిదంబర రెడ్డి, ఆచార్య బాలసుబ్రమణ్యం, అంకె శ్రీనివాస్, దీవెన, తరిమెల అమరనాథ రెడ్డి, ఎల్.ఆర్.వెంకటరమణ, జూటూరు షరీఫ్, రియాజుద్దీన్, రాధేయ, వెంకటేసులు, రమణ ప్రసాద్, నానీల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. - హిదయతుల్లాసాహితీ స్రవంతి అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి