డా|| పట్టాభి కళాపీఠం తరపున పట్టాభి అవార్డ్స్లో భాగంగా ఆచార్య నెల్లుట్ల స్మారక కవితా పురస్కారం - 2018, శ్రీ మక్కెన రామసుబ్బయ్య స్మారక కథా పురస్కారం - 2018 కోసం 2017లో ప్రచురించిన సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు డా|| తూములూరి రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. రెండు కాపీలను డా|| తూములూరి రాజేంద్రప్రసాద్, కేరాఫ్ ఆంధ్రాబ్యాంక్, ఏలూరు రోడ్డు శాఖ, విజయవాడ - 520 002 చిరునామాకు పంపవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు 9490332323 ద్వారా సంప్రదించవచ్చును