ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు-2018 కోసం కవుల నుండి కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్ చైర్మన్ డా.ఉమ్మడిశెట్టి రాధేయ ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు పరిశీలన కోసం 2018 సంవత్సరంలో ప్రచురణ పొందిన కవితా సంపుటాలను మాత్రమే పంపాలి. ఎంపికైన ఉత్తమ కవితా సంపుటకి అయిదు వేలు రూపాయలు నగదు, షీల్డ్ కవికి అందజేయనున్నట్లు తెలిపారు. జనవరి 31వ తేదీ లోగా నాలుగు ప్రతులు ఈ దిగువ చిరునామాకు పంపవలసిందిగా కోరారు. డా.ఉమ్మడిశెట్టి రాధేయ, ఛైర్మన్, ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్, 13-1-606-1 షిర్డీ నగర్, రెవిన్యూ కాలనీ, అనంతపురం-515001. ఇతర వివరాలకు 9985171411 ద్వారా సంప్రదించవచ్చును.