సమాజంలో భిన్న రూపాలలో వివక్షత నెదుర్కొంటున్న ''ట్రాన్స్జెండర్-వ్యక్తుల జీవన విధానం, సమస్యలు, పరిష్కారాల''ను ఇతివృత్తంగా తీసుకున్న కథలను పోటీకి ''సమన్విత'' సంస్థ ఆహ్వానిస్తున్నట్లు సమన్విత కన్వీనర్ డి. శమంతకమణి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి బహుమతి రూ|| 3,000/-, రెండవ బహుమతి రూ|| 2,000/-, మూడవ బహుమతి రూ|| 1,000/-, రెండు కన్సొలేషన్ బహుమతులు ఒక్కొక్కరికి రూ|| 500/-లు చొప్పున అందించనున్నట్లు తెలిపారు. ''కోపూరి చారిటబుల్ ట్రస్ట్ - విజయవాడ'' తరుఫున ప్రముఖ రచయిత్రి శ్రీమతి కోఫూరి పుష్పాదేవి బహుమతులను అందిస్తారని తెలిపారు. కథలను జూలై 15లోగా ''సమన్విత'', ఇ.నెం. 3-274/207, శ్రీరామ్స్ స్నేహా అవెన్యూ, అరవింద హై స్కూల్ వద్ద, కుంచనపల్లి, అమరావతి - 522 501 చిరునామాకు పంపించవలసిందిగా కోరారు.