పాతూరి మాణిక్యమ్మ స్మారక రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం 2017 సంవత్సరానికి చిత్తలూరి సత్యనారాయణ ''నల్ల చామంతి'' కవితా సంపుటికి, 2018 సంవత్సరానికి సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ''బడి'' కవితా సంపుటికి అందించనున్నట్లు పాతూరి అన్నపూర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. 2017 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి శిలాలోలిత 2018 సంవత్సరానికి ప్రముఖ రచయిత దాట్ల దేవదానం రాజు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినట్లు తెలిపారు. విజేతలకు జూన్ 30న నెల్లూరు పురమందిరంలో సత్కరించి ఐదువేల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు.