డా|| పట్టాభి కళాపీఠం 9వ వార్షికోత్సవం సందర్భంగా ఇచ్చే 'పట్టాభి అవార్డ్-2019' కోసం 'నెల్లుట్ల స్మారక కవితా పురస్కారం - 2019' కోసం 2018 సంవత్సరంలో ప్రచురించిన 3 కవితా సంపుటాలను, 'మక్కెన రామసుబ్బయ్య స్మారక కథా పురస్కారం - 2019' కోసం 2018లో ప్రచురించిన 3 కథా సంపుటాలను అక్టోబర్ 30లోపుగా పంపించవలసిందిగా సంస్థ అధ్యక్షులు డా|| తూములూరి రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. రచయితలు తమ పుస్తకాలను డా|| తూములూరి రాజేంద్రప్రసాద్, వ్యవస్థాపక అధ్యక్షులు, డా|| పట్టాభి కళాపీఠము, ఎఫ్.ఎఫ్.3, నాగేంద్ర టవర్స్, దుర్గాపురం, విజయవాడ - 520 002 చిరునామాకు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు 9490332323 ద్వారా సంప్రదించవచ్చును.