ప్రముఖ కవి, రచయిత, అధ్యాపకుడు డా. కెఎస్.రమణ మృతి తెలుగు సాహితీ రంగం, తెలుగు భాషకు తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. కెఎస్. రమణ మిత్రబృందం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో డా.కెఎస్. రమణ జ్ఞాపకాలు పేరిట సంస్మరణ సభ జరిగింది. పలువురు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో రమణ రచించిన 'జడి' కవితా సంపుటి అనేకమందిని ఆలోచింపజేసిందన్నారు. సార్వత్రిక విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ అధిపతిగా తెలుగుభాష వికాసం కోసం రమణ తోడ్పాటునందించారని అన్నారు. ఈ సభలో సాహితీస్రవంతి అధ్యక్షులు తెలకపల్లి రవి, కుప్పిలి పద్మ, సాహితీవేత్తలు ఎన్ వేణుగోపాల్, తుమ్మల రామకృష్ణ, సౌభాగ్య, గుడిపాటి, ఎస్వీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రస్థానం పత్రికకు కూడా రమణ పలు రచనలు అందించారు.