భద్రాచలంలో కథా సదస్సు

            భద్రాచలం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24న కథా సదస్సు జరిగింది. ఈ సభలో పలువురు ఔత్సాహిక కథకులు పాల్గొన్నారు. మాగంటి సూర్యం, సాధనాల వెంకటస్వామినాయుడు సమన్వయంలో జరిగిన ఈ కథా సదస్సులో అమ్మిన శ్రీనివాస రాజు మాట్లాడుతూ ఎక్కువ కాలం గుర్తుండేది మంచి కథ అన్నారు. చాలా మందికి కథ ప్రారంభించడం రాదు. అది ఒక కళ, కొందరు వ్యాసాలను రాసి కథ అంటారు అని అన్నారు. మండవ సుబ్బారావు మాట్లాడుతూ కథలు వేరు. కథానిక వేరు. 100 ఏళ్ళు నిండింది కథానికకు, కథకు కాదు అన్నారు. కథానిక ఆధునిక రూపం అన్నారు. శిరంశెట్టి కాంతారావు మాట్లాడుతూ సమాజంలో తన చుట్టూ జరుగుతున్న వాటిని పసిగట్టాలి అన్నారు. జ్వలిత మాట్లాడుతూ బాధితుల కోణంలో రచయితల స్పందించినప్పుడే రచయిత సమాజానికి ఉపయోగపడే విధంగా రాయగలుగుతారని అన్నారు. కె.వి.ఎన్‌. మూర్తి, మాల్యశ్రీ, తాతోలు దుర్గాచారి, అరుణకుమారి, రామరాజు, తులసీదాస్‌, బుచ్చిరాములు తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.