మార్చి 31న గురజాడ స్వగృహంలో సాహితీ స్రవంతి పై అంశంపై సాహితీ స్రవంతి కన్వీనర్ చీకటి దివాకర్ అధ్యక్షతన విద్యుత్ కోతలు - వాతలు కవిగాయక సమ్మేళనం జరిగినది. ఇందుకు ముఖ్య అతిథిగా ప్రముఖ కథా, నవలా రచయిత దూరి. వెంకటరావు, హాజరయ్యారు. ఎస్.వి.ఆర్. కృష్ణారావు, సి.ఎస్.ఎస్. శ్రీనివాసరావు నిర్వహించారు. పై అంశంపై కృష్ణారావు ప్రసంగిస్తూ కొద్దిమంది సంపన్నుల కోసం పేదలపై విద్యుత్ భారం వేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో నూటికి 70%గా వున్న పేదలు, మధ్య తరగతి, సామాన్యులు వాడే విద్యుత్ కేవలం 30% సంపన్నుల 20% మందే వున్నా వారు వాడే విద్యుత్ మాత్రం 70% వుందన్నారు. వీరు వాడుతున్న విలాస విద్యుత్ కోసం తక్కువ వినియోగిస్తున్న సామాన్యులపై భారం వేయడం సరికాదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ విధానాల ఇంధన సర్చార్జీల భారాల వలన అసెంబ్లీ నుండి గ్రామాల వరకు కరెంటు మంటలు రేగుతున్నాయి అన్నారు. నేడు ప్రతిపక్షంలో వున్నవారు, అధికార పక్షంలో వున్నవారు స్వర్ణాంధ్రప్రదేశ్, హరితాంధ్రప్రదేశ్ చేస్తామన్నారు. కానీ నేడు రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. వ్యవసాయ సంక్షోభం, పారిశ్రామిక మాంధ్యం విద్యుత్ ఆధారిత కులవృత్తులు నేడు పనిలేక సంక్షోభంలో కూరుకుపోతున్నారు అని చెప్పారు. విద్యుత్ను ప్రైవేటీకరించడం ద్వారానే నేడు ఈ స్థితికి దిగజారినట్లు సంస్కరణలను పునః సమీక్షించాలని పేర్కొన్నారు.
ముఖ్య అతిథి మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు వున్నా కరెంటు సమస్యను సుపక్షీయులు, విపక్షీయులు ప్రజలకు కోతలు లేకుండా భారాలు లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా మహాభాష్యం, మానాపురం, కనక లింగేశ్వరరావు, ప్రసాదు, రెడ్డి రామకృష్ణ, తమ తమ కవితలను, గేయాలను, చళ్ళపిల్ల శ్యామల గారు కథానిక చదివి వినిపించారు పలువురు కవులు, రచయితలు పాల్గొన్న ఈ కవిగాయక సమ్మేళనాన్ని పి.ఎస్. శ్రీనివాసరావు సాహితీ స్రవంతి నిర్వాహకులు సమన్వయం చేశారు.
బి. హైమావతి
హైదరాబాద్లోని మీర్పేట్లో ఎన్.బి.ఆర్. కాలనీలో ఏప్రిల్ 14న కళాతరంగిణి ఆధ్వర్యంలో జరిగిన కవి సమ్మేళనంలో సుంకేసుల రోశిరెడ్డి కవిశ్రీ కొరుప్రోలు మాధవరావు, ఆర్. వెంకట సుబ్బయ్య ఆచార్య కొలకలూరి ఇనాక్, కొండూరి కాశీ విశ్వేశ్వరరావు ఉన్నారు.