2013 సంవత్సరము ''శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారం'' పేరుతో ఇచ్చే విమలాశాంతి సాహిత్య పురస్కారాన్ని కథకులకు ప్రదానం చేయడానికి జాతీయస్థాయిలో ఉత్తమ కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నట్లు శాంతినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సంవత్సరం కవిత్వానికి ఒక సంవత్సరం కథకు ఇచ్చే ఈ పురస్కారాన్ని ఈ సంవత్సరం కథకు ఇస్తున్నారు. ఈ పురస్కారం క్రింద రూ.10,000/-ల నగదును, జ్ఞాపికను అందజేస్తారు.
నిబంధనలు : జనవరి 2011 నుండి డిసెంబరు 2012 మధ్యకాలంలో ప్రచురించిన కథా సంపుటాలు మాత్రమే పరిశీలనకు స్వీకరింపబడతాయి. రచయితలు తమ తమ కథా సంపుటాలను 15.7.2013వ తేదీ లోగా డా|| అంకే శ్రీనివాస్, తెలుగు లెక్చరర్, కేరాఫ్ డి. జయనారాయణ, జనరల్ స్టోర్స్, డోర్ నెం. 1/325, నీలిమా థియేటర్ ఎదురుగా 1వ రోడ్డు, అనంతపురం అనే చిరునామాకు పంపాలి. పరిశీలన కోసం పంపే కథా సంపుటాలను నాలుగు కాపీల వంతున పంపాలి. మూడు కాపీల మీద ''విమలాశాంతి సాహిత్య పురస్కారం కోసం'' అని తప్పనిసరిగా రాసి పంపాలి. ఎంపికయిన కథా సంపుటి రచయితకు 2013 సెప్టెంబరులో జరిగే పురస్కారోత్సవ సభలో అవార్డును ప్రదానం చేస్తామని తెలిపారు.