సాహితీ స్రవంతి కాకినాడ టౌన్ శాఖ ఆధ్వర్యంలో జూలై 7వ తేదీ సా. 6గం|| గాంధీభవన్లో గరికపాటి మాష్టారు అధ్యక్షతన తంగిరాల చక్రవర్తి స్వీయ కవితాసంపుటి ''విసురు'' ఆవిష్కరణ సభ జరిగింది. ప్రముఖ కవి, విమర్శకులు డా|| అద్దేపల్లి రామమోహన్ రావు గారు గ్రంథావిష్కరణ చేసారు. రెక్కలు ప్రక్రియ నేటి ఆధునిక కవితా యుగంలో కొత్తదారులు తెరచిందని.. సామ్రాజ్యవాద వ్యతిరేక రెక్కలుగా ''విసురు'' సంపుటిని శ్లాఘిస్తూ డా|| అద్దేపల్లి మాట్లాడారు. మాకినీడు సూర్యభాస్కర్, వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు, గ్రంథ సమీక్ష చేసారు. కాలనాధ భట్ట వెంట్రామ శాస్త్రి కవి చక్రవర్తిని ''అద్దేపల్లి ఫౌండేషన్ సాహితీ పురస్కారంతో సత్కరించారు. పెళ్ళి వారిల్లు అంశంపై కవి సమ్మేళనం జరిగింది. ''గనారా'' స్వాగతం, వందన సమర్పణ చేసిన ఈ సభలో దాట్ల దేవదానం రాజు, ఫ్రెంచ్ కవి డేనియల్, శ్రీవత్స రామకృష్ణ, టి.జి. సాయి దంపతులు అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 40 మంది కవులు స్వీయ కవితలు చదివారు.