విశాఖపట్నం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జులై 6న ద్వారకానగర్లోని పబ్లిక్ లైబ్రరీలో ''కవితల పోటీ'' జరిగింది. ''ఉత్తరాఖండ్ విషాదం'' ''మహిళలపై హింస'' అనే రెండు అంశాలపై నిర్వహించిన ఈ కవితలపోటీలో 21 మంది కవులుపాల్గొని తమ కవితలు వినిపించారు. జి.వి.ఎన్. చలపతి (సాహితీ స్రవంతి జిల్లా బాధ్యులు) మోదురాజేశ్వరరావు (రచయిత) న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ క్రింది కవులకు బహుమతులు అందజేయడం జరిగింది.
1. మొదటి బహుమతి ''చుక్కల్లో రక్తధార'' - ఎ
మొదటి బహుమతి ''చుక్కల్లో రక్తధార'' - ఎం. పవన్ కుమార్ 2. ద్వితీయ బహుమతి ''మమ్మల్నిలా బ్రతకనివ్వండి'' - మొదలవలస పద్మావతి 3. తృతీయ బహుమతి ''చంక సంచి'' - మోకారత్నరాజు 4. కన్సొలేషన్ ''నిర్భయ మురళిఘోష'' - నాయని కళ్యాణి శ్రీదీప్తి
విజేతలకు శ్రీమతి పద్మ (ఐద్వా, నగర కార్యదర్శి) రమణాచలం కన్వీనర్, సాహితీ స్రవంతి, అరుణ్జీ, ప్రనాలే బహుమతులు అందచేశారు. కార్యక్రమానికి ఎ.వి. రమణారావు, అధ్యక్షత వహించారు. వరప్రసాద్ వందన సమర్పణ చేశారు. సాహితీ స్రవంతి కార్యదర్శి నూనెల శ్రీనివాసరావు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ సాహిత్యంపై సంగ్రహంగా ప్రసంగించారు. కార్యక్రమంలో సాహితీ అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.