అద్దేపల్లికి రసధుని అవార్డు

  పాలకొల్లు రసధుని సాహితీ సంస్థ ఆధ్వర్యాన అందించే శ్రీ పెద్దిభోట్ల బ్రహ్మయ్య స్మారక అవార్డును ప్రముఖ సాహితీవేత్త, అభ్యుదయ కవి అద్దేపల్లి రామమోహనరావుకి ప్రదానం చేశారు. జూన్‌ 30వ తేదీన స్థానిక లయన్స్‌ కమ్యూనిటీహాల్‌లో జరిగిన ఈ సభకు రసధుని అధ్యకక్షులు వంగా నరసింహరావు అధ్యక్షత వహించగా, స్థానిక ఇన్‌కంటాక్స్‌ అధికారి యం.యస్‌. సుకుమార్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన రామమోహనరావు తెలుగు సాహిత్యానికి అందించిన సేవలు కొనియాడారు. ఈ సభకు ముఖ్యవక్తగా విచ్చేసిన ఏలూరు ప్రభుత్వ కళాశాల ప్రధానాచార్యులు, ప్రముఖ కవి కొప్పర్తి వెంకట రమణమూర్తి మాట్లాడుతూ ఆయన విరామం ఎరుగని కవి అని, సమాజం కోసం అనేక రచనలు చేశారని మొదటి థలో భావకవిగా, రెండవథలో అభ్యుదయ కవిగా, మూడవ థలో నిబద్ధత వున్న అభ్యుదయ కవిగా ఉంటూ, నాల్గవ థలో ప్రపంచీకరణకు వ్యతిరేక రచనలు చేశారు అని ఆయన అన్నారు. రామమోహనరావు వ్రాసిన కవితలలో కొన్నింటిని సోదాహరణంగా వివరించారు. మరొక వక్తగా కొత్తపేట ప్రభుత్వ కళాశాల ప్రధానాచార్యులు ఆర్‌.ఎస్‌. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామమోహనరావు రెండవ పార్శ్యం సాహితీ విమర్శ అని, నాడు శ్రీశ్రీ కవిత్వం మీద రాసిన సాహితీ విమర్శ ఎందరినో ఆకర్షించిందని రామమోహనరావు వ్రాసినన్ని పీఠికలు ఆంధ్రదేశంలో ఎవరూ వ్రాయలేదని తెలియజేశారు. నేడు బహుప్రాచుర్యం పొందిన మినీ కవితకు ఆయన సిద్ధాంత కర్త అని ఆర్‌.ఎస్‌. తెలియచేశారు. అద్దేపల్లి సమాధానం ఇస్తూ నేటి ప్రపంచీకరణ ప్రభావం దేశంలోని అన్ని రంగాలలోను ఉందని తద్వారా భారతీయత తెరమరుగు అవుతున్నదని, దానిని కాపాడవలసిన బాధ్యత భారతీయుల అందరిమీద ఉన్నదని ఆయన తన ఆవేదనను తెలియచేశారు. ప్రముఖ ఆడిటర్‌  పెద్దిభొట్ల లక్ష్మీనారాయణ తన తండ్రి బ్రహ్మయ్య పేరున గత పదిహేను సంవత్సరాలుగా ఇస్తున్న అవార్డు 7వేల రూపాయల నగదు, జ్ఞాపిక, దుశ్శాలువలతో రామమోహన్‌రావుని సత్కరించారు. ఇంకా ఈ సభలో ప్రముఖ కవులు కడిమెళ్ళ వరప్రసాద్‌ గురు సహస్ర అవధాని, రెడ్డప్ప ధవేజి, కె.యస్‌.మూర్తి, భగవాన్‌, చేగొండి రంగారావు, పట్టణ ప్రముఖులు బొండాడ రాధారమణ్‌ గుప్త, విన్నకోట వెంకటేశ్వరరావు, కొల్లి నరసింహమూర్తి తదితరులు రామమోహనరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి వి.కె. సత్యనారాయణ, జె.దుర్గారావు, వై. ప్రభాకర శాస్త్రి తదితరులు సారధ్యం వహించారు.