'2013 శాంతి రజనీకాంత్ స్మారక కథాపురస్కారాన్ని' వేంపల్లి షరీఫ్ (కడప జిల్లా) ''జుమ్మా'' అనే కథా సంపుటికి, మల్లిపురం జగదీష్ (శ్రీకాకుళం జిల్లా) 'శిలకోల' అనే కథా సంపుటికి సంయుక్తంగా అందజేస్తున్నట్టు డా. శాంతి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీకి 43 గురు రచయితలు తమ కథా సంపుటాలను పంపారని తెలిపారు. అక్టోబర్ నెలలో జరిగే పురస్కార ప్రధానోత్సవ సభలో రచయితలకు జ్ఞాపికలతో పాటు ఒక్కొక్కరికి రూ. 5000/-ల చొప్పున నగదును అందజేస్తామని తెలిపారు. ఈ పురస్కారాల ఎంపికలో ఆచార్య కాత్యాయని విద్మహే, గంటేడు గౌరునాయుడు, డా|| వి.ఆర్. రాసాని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినట్లు తెలిపారు.