వల్లభాపురం జనార్ధన కు నోముల కథా పురస్కారం

ప్రముఖ కవి, రచయిత వల్లభాపురం జనార్ధన్‌ నోముల కథా పురస్కారం అందుకున్నారు. సెప్టెంబర్‌ 14న నల్లగొండ జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నోముల సత్యనారాయణ అధ్యక్షతన నోముల సాహిత్య సమితి ఆధ్వర్యంలో నోముల కథా పురస్కార ప్రధానోత్సవం జరిగింది. వల్లభాపురం జనార్ధన రాసిన ''బహుమతి'' కథకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ కమీషనర్‌ ఎన్‌. ముక్తేశ్వర రావు చేతుల మీదుగా కథా పురస్కారం అందుకున్నారు. కథల ఎంపికకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన కేతు విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ 'బహుమతి' కథా వాస్తవికత చిత్రణతో పాత్రోచితభాషతో ఉన్నదని ప్రశంసించారు.