సాహితీస్రవంతి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జూలై 24న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన 'గుర్రం జాషువా' వర్థంతి సభలో ప్రసంగిస్తున్న డా|| శిఖామణి. చిత్రంలో వెంకటి, తంగిరాల చక్రవర్తి, గేరా.సాహితీస్రవంతి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జూలై 24న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన 'గుర్రం జాషువా' వర్థంతి సభలో ప్రసంగిస్తున్న డా|| శిఖామణి. చిత్రంలో వెంకటి, తంగిరాల చక్రవర్తి, గేరా.సాహితి స్రవంతి నగర కమిటీ ఆధ్వర్యంలో జూలై24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గుఱ్రం జాషువా వర్థంతి సభ, జనకవనం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు డా. శిఖామణి మాట్లాడుతూ జాషువా అంటరాని వాడిగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడని, అయినప్పటికీ పట్టుదలగా సాహిత్యకృషి కొనసాగించి, గండ పెండీరం చేజిక్కించుకుని నవయుగ కవి చక్రవర్తిగా కీర్తికెక్కారని అన్నారు. రుక్మిణి కళ్యాణం, ఫిరదౌసి, గబ్బిలం వంటి ఎన్నో కావ్యాలనే కాకుండా, నాటకాలను రచించారని కొనియాడారు. తెలుగు సాహిత్య చరిత్రలో కాలానికి తట్టుకుని నిలిచిన కవి జాషువా అని మరో వక్త, కవి గేరా అన్నారు. ఆయన భాషా సౌందర్యం అద్భుతమని, ఎవరి కోసం రాజీపడకుండా తనకి నచ్చినట్లుగా వర్ణించే సాంప్రదాయ కవి అని ఆయన అన్నారు. సాహితీ స్రవంతి నగర కమిటీ అధ్యకక్షులు తంగిరాల చక్రవర్తి సభకు అధ్యక్షత వహించారు. కార్యదర్శి శాంతిశ్రీ, గజెవెల్లి థరధరామయ్య, ఒబ్బిని సన్యాసిరావు, మోపిదేవిరాధాకృష్ణ, ఆచార్యనరేంద్ర, పొత్తూరి సుబ్బారావు, శిష్టామాధవి, జి.ఆంజనేయులు, జి.రామకృష్ణ, కోరుపోటరాధాకృష్ణ, వొరప్రసాద్, అహవళి హనుమంతరావు, మౌనశ్రీమల్లిక్, పెద్దూలి, వెంకట్దాస్, కె.శాంతారావు, కె.ఎల్.కామేశ్వరరావు, లాడే ధనంజయ్, శిల్పాజగదీష్, ప్రభుదాసు, బొపారా, జస్వంతరావు, తదితరులు స్వీయ కవితలు చదివారు.టి.వెంకటి జనకవనం నిర్వహించారు. మోహనకృష్ణ వందన సమర్పణ చేశారు.