విజయనగరం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జూలై 24న జరిగిన గుర్రం జాషువా వర్థంతి సభలో ప్రసంగిస్తున్న ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి. చిత్రంలో చంద్రికవిజయనగరం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జూలై 24న గురజాడ స్వగృహంలో గుర్రం జాషువా వర్థంతి సభ జరిగింది. ఈ సభలో చాగంటి తులసి మాట్లాడుతూ జాషువా అనుభవాలే ఆయన కవితలుగా రాశారని అన్నారు. జాషువా రచనలను ఔత్సాహిక కవులు అధ్యయనం చేయాలని కోరారు. ఎస్. అంబేద్కర్ మాట్లాడుతూ పద్యరూపాన్ని జాషువా ఎన్నుకున్నారని, వినూత్న రీతిలో రాశారని అన్నారు. ప్రణవశ్రీ వేదవల్లి, గండేటి శ్రీనివాసరావు, చంద్రిక, నిర్మల, షణ్ముఖరావు పాటలు వినిపించారు. దాసరి తిరుపతి నాయుడు, తూట బాబాజీ జాషువా పద్యాలు వినిపించారు. ఇనుగంటి జానకి, యుప్పలూరి శైలజ, విజయాదిత్య, మొయిద శ్రీనివాస్, బాలకృష్ణ, యం. చంథ్రేఖర్, పిళ్ళారాంప్రసాద్, చింతా నాగేశ్వర్ తదితరులు కవితలు చదివారు. యస్.వి.ఆర్. కృష్ణారావు స్వాగతం పలికారు. చంద్రిక సభాధ్యక్షత వహించారు. పి.యస్. శ్రీనివాసరావు వందన సమర్పణతో సభ ముగిసింది.