
మంచూరు కిషోర్
తెలుగు అనువాద అధ్యయన శాఖ, పరిశోధక విద్యార్థి
ఆచార్య కిన్నెర శ్రీదేవి
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం
1946-55 దశాబ్దంలో స్త్రీల కథలు ఎక్కువగానే వచ్చాయి. స్వాతంత్య్రానికి పూర్వం స్త్రీలు కథలు రాసినప్పటికీ, స్వాతంత్య్రానంతరం కూడా కథాసాహిత్య క్షేత్రంలో రచయిత్రులు కృషి చేస్తూనే వున్నారు. ఆచంట శారదాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి, ఇల్లిందల సరస్వతీ దేవి మొదలైన ఉద్ధండులైన రచయిత్రులు ఈ దశాబ్దిలోనే రచనా వ్యాసంగం ప్రారంభిం చారు. వితంతు స్త్రీల దుర్భర స్థితిగతులు, వరకట్న దురాచారం, అస్ప ృశ్యతా సమస్య ... ఇలా అనేక సమస్యలపై రచయిత్రులు కథలు రాశారు. ఈ కాలంలో కథలు రాసిన స్త్రీల పేర్లు సాహిత్య చరిత్ర గ్రంథాల్లో కనబడుతున్నాయి. కానీ ఆ రచనలన్నీ ఈనాడు అందుబాటులో లేవు. 1947కు ముందు రాసిన మగవాళ్ళ రచనలు అనేకం లభిస్తుండగా, స్త్రీల రచనలన్నీ సాంతం లభించకపోవడం అసంతృప్తి కలిగిస్తోంది.